--- నా అంచనా ---
రాష్ట్రవిభజన అంశం మిగిలిన దేశంపై ఏ మాత్రం ప్రభావం చూపదు . మోడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి రావడం తధ్యం .
ఇక మనరాష్ట్రంలో , KCR కి కావాల్సినంత డబ్బు ఇచ్చి TRS ను కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటుంది సోనియా . కృతజ్ఞత
పేరుతొ , TRS ను సోనియా కు KCR అమ్ముకుంటాడు . తెలంగాణా లో ఇద్దరికీ ప్రత్యర్ధి BJP . దానిపై కాంగ్రెస్ విమర్సనాస్త్రాలు ఎలా ఉంటాయంటే , “ BJP కి ప్రజలు అధికారం అప్పగించినా , చంద్రబాబు వద్దన్నాడని , తెలంగాణా ని ఇవ్వలేదు . ఒక్క చంద్రబాబు వ్యతిరేకించినందువల్ల BJP తెలంగాణా ఇచ్చే సాహసం చెయ్యలేకపోయింది . కాని
కాంగ్రెస్ మాత్రం తన స్వంత పార్టీ లోనే ఎంత వ్యతిరేకత ఉన్నా , తన MP లు , MLA లు , మంత్రులు , చివరకు తన
ముఖ్యమంత్రి సైతం వ్యతిరేకించినా , సీమాంద్రలో తన పార్టీకి ఎంత నష్టం జరుగుతున్నా , భయపడక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణా ఇచ్చింది “ ఈ ప్రచారం తో తెలంగాణా ఓట్లు కొల్లగొట్టుకుంటుంది . పాపం BJP కి చారిత్రక తప్పిదం
మిగులుతుంది . చంద్రబాబు నాయుడుకి ఒక కన్ను శాశ్వతంగా గుడ్డిదవుతుంది .
ఇక సీమాంద్రలో , కిరణ్ , సమైక్యవాదం పేరుతొ కొత్త పార్టీ పెడతాడు . విభజనను అన్యాయంగా చూబిస్తూ , చంద్రబాబు ఇచ్చిన లేఖ , జగన్ చెప్పిన ఆర్టికల్ ౩ ని అస్త్రాలుగా చేసుకుని , BJP , TDP పొత్తును విమర్శిస్తూ అక్కడ ఓట్లు దండుకుంటాడు . ఇంకా పేద ప్రజల మనసులలో మిగిలిన రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం , చర్చిల సహకారంతో ఏమైనా ఓట్లు మిగిలి పోయి ఉంటే అవి జగన్ బాబు పట్టుకుపోతాడు . అక్కడ చంద్రబాబు 2 వ కన్ను పోతుంది . ఎన్నికలు అయ్యాక , BJP అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కి సీమాంధ్ర కు జరిగిన అన్యాయం , వాళ్ళ సమస్యలు గుర్తుకు వస్తాయి . ఆసుపత్రుల గురించి ,IIT ల గురించి ప్యాకేజి లా గురించి , సీమాంధ్రుల తరపున పోరాడుతుంది . BJP కి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కల్పిస్తుంది . ఆ CREDIT తన ఖాతా లో వేసుకుంటుంది . విభజన వాదం కంటే , మతతత్వ వాదం దేశానికి మరీ ప్రమాదం . కాబట్టి మన రాష్ట్రాన్ని విభజించి మనకు అన్యాయం చేసినా , మత తత్వ పార్టీలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా , కాంగ్రెస్ కు బయట నుంచి మద్దతు పలుకుతున్నామంటారు కిరణ్ , జగన్ లు . సీమాంధ్రుల తరపున కాంగ్రెస్ పోరాటాలు కూడా కొంత కలిసొస్తాయి .కొంత కాలం గడిచాక , ప్రజలు మరచిపోయారని భావించాక , తమ పార్టీ లను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు . ఇక్కడా BJP కి శూన్యం .
ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో TDP , BJP లను శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ .
ఇక్కడ మాత్రం BJP తనకు అందివచ్చిన చక్కటి అవకాశాన్ని జారవిడుచుకుంది . విభజన ప్రక్రియ సక్రమంగా లేదని , రాష్ట్రానికి బదులు , ప్రజలను విడదీస్తున్నారని , అందువలన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని తప్పించుకుని , తను అధికారం లోకి వచ్చాక , తన శైలి లో సక్రమంగా విభజించి ఉంటే , ఇరు ప్రాంత ప్రజల ఆదరణ పొంది ఉండేది . ఇది BJP కి చారిత్రక తప్పిదంగా మిగిలిపోతోంది .
మనదేశం నుండి కాంగ్రెస్ ని తరిమెయ్యాలని మిగిలిన ప్రజలు ఎంతగా ప్రయత్నించినా , ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సహకారంతో , ఎలాగోలా బతికిపోతోంది ! !
రాష్ట్రవిభజన అంశం మిగిలిన దేశంపై ఏ మాత్రం ప్రభావం చూపదు . మోడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి రావడం తధ్యం .
ఇక మనరాష్ట్రంలో , KCR కి కావాల్సినంత డబ్బు ఇచ్చి TRS ను కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటుంది సోనియా . కృతజ్ఞత
పేరుతొ , TRS ను సోనియా కు KCR అమ్ముకుంటాడు . తెలంగాణా లో ఇద్దరికీ ప్రత్యర్ధి BJP . దానిపై కాంగ్రెస్ విమర్సనాస్త్రాలు ఎలా ఉంటాయంటే , “ BJP కి ప్రజలు అధికారం అప్పగించినా , చంద్రబాబు వద్దన్నాడని , తెలంగాణా ని ఇవ్వలేదు . ఒక్క చంద్రబాబు వ్యతిరేకించినందువల్ల BJP తెలంగాణా ఇచ్చే సాహసం చెయ్యలేకపోయింది . కాని
కాంగ్రెస్ మాత్రం తన స్వంత పార్టీ లోనే ఎంత వ్యతిరేకత ఉన్నా , తన MP లు , MLA లు , మంత్రులు , చివరకు తన
ముఖ్యమంత్రి సైతం వ్యతిరేకించినా , సీమాంద్రలో తన పార్టీకి ఎంత నష్టం జరుగుతున్నా , భయపడక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణా ఇచ్చింది “ ఈ ప్రచారం తో తెలంగాణా ఓట్లు కొల్లగొట్టుకుంటుంది . పాపం BJP కి చారిత్రక తప్పిదం
మిగులుతుంది . చంద్రబాబు నాయుడుకి ఒక కన్ను శాశ్వతంగా గుడ్డిదవుతుంది .
ఇక సీమాంద్రలో , కిరణ్ , సమైక్యవాదం పేరుతొ కొత్త పార్టీ పెడతాడు . విభజనను అన్యాయంగా చూబిస్తూ , చంద్రబాబు ఇచ్చిన లేఖ , జగన్ చెప్పిన ఆర్టికల్ ౩ ని అస్త్రాలుగా చేసుకుని , BJP , TDP పొత్తును విమర్శిస్తూ అక్కడ ఓట్లు దండుకుంటాడు . ఇంకా పేద ప్రజల మనసులలో మిగిలిన రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం , చర్చిల సహకారంతో ఏమైనా ఓట్లు మిగిలి పోయి ఉంటే అవి జగన్ బాబు పట్టుకుపోతాడు . అక్కడ చంద్రబాబు 2 వ కన్ను పోతుంది . ఎన్నికలు అయ్యాక , BJP అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కి సీమాంధ్ర కు జరిగిన అన్యాయం , వాళ్ళ సమస్యలు గుర్తుకు వస్తాయి . ఆసుపత్రుల గురించి ,IIT ల గురించి ప్యాకేజి లా గురించి , సీమాంధ్రుల తరపున పోరాడుతుంది . BJP కి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కల్పిస్తుంది . ఆ CREDIT తన ఖాతా లో వేసుకుంటుంది . విభజన వాదం కంటే , మతతత్వ వాదం దేశానికి మరీ ప్రమాదం . కాబట్టి మన రాష్ట్రాన్ని విభజించి మనకు అన్యాయం చేసినా , మత తత్వ పార్టీలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా , కాంగ్రెస్ కు బయట నుంచి మద్దతు పలుకుతున్నామంటారు కిరణ్ , జగన్ లు . సీమాంధ్రుల తరపున కాంగ్రెస్ పోరాటాలు కూడా కొంత కలిసొస్తాయి .కొంత కాలం గడిచాక , ప్రజలు మరచిపోయారని భావించాక , తమ పార్టీ లను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు . ఇక్కడా BJP కి శూన్యం .
ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో TDP , BJP లను శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ .
ఇక్కడ మాత్రం BJP తనకు అందివచ్చిన చక్కటి అవకాశాన్ని జారవిడుచుకుంది . విభజన ప్రక్రియ సక్రమంగా లేదని , రాష్ట్రానికి బదులు , ప్రజలను విడదీస్తున్నారని , అందువలన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని తప్పించుకుని , తను అధికారం లోకి వచ్చాక , తన శైలి లో సక్రమంగా విభజించి ఉంటే , ఇరు ప్రాంత ప్రజల ఆదరణ పొంది ఉండేది . ఇది BJP కి చారిత్రక తప్పిదంగా మిగిలిపోతోంది .
మనదేశం నుండి కాంగ్రెస్ ని తరిమెయ్యాలని మిగిలిన ప్రజలు ఎంతగా ప్రయత్నించినా , ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సహకారంతో , ఎలాగోలా బతికిపోతోంది ! !

good analysis
ReplyDelete