Wednesday, 5 March 2014

మహేష్ బాబుకు యాక్సిడెంట్!!!!!!!!!!!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బళ్లారిలో జరుగుతోంది. అయితే షూటింగ్‌ను అర్థాంతరంగా ముగించుకుని మహేష్‌ హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. కారణం చిత్ర షూటింగ్‌లో భాగంగా మహేష్‌కు చిన్న ప్రమాధం జరిగిందట. కాలుకు ప్యాక్చర్‌ కావడంతో వారం రోజులు రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారట. దాంతో మహేష్‌ హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
‘దూకుడు’ తర్వాత అదే కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆగడు’ చిత్రంను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 14 రీల్స్‌ పతాకంపై అనీల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ‘అత్తారింటికి దేరేది’ ఫేం నదియా ఈ చిత్రంలో మహేష్‌కు అక్కగా నటిస్తోంది. ‘1’ చిత్రం ఫెయిల్‌ తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

No comments:

Post a Comment